- Advertisement -
హైదరాబాద్: దుబ్బాకలోని నార్సింగ్ జడ్పి హైస్కూల్లో పోలింగ్ సరళిని కలెక్టర్ భారతి హోళికేరి పరిశీలించారు. ఉదయం 11 గంటలకు వరకు 34.33 శాతం పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. దేశంలోని పది రాష్ట్రాలలో అసెంబ్లీ ఉప ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఉదయం 11 గంటల వరకు పలు రాష్ట్రాల్లో పోలింగ్ నమోదు వివరాలు ఇలా ఉన్నాయి. ఛతీస్గఢ్(21.5 శాతం), హర్యానా(19.5 శాతం), జార్ఖండ్(30.37), మధ్య ప్రదేశ్(15.21), నాగాలాండ్(38.69), ఒడిశా(9.81), ఉత్తర ప్రదేశ్(13.69), గుజరాత్(18.36) శాతంగా ఉన్నాయి.
- Advertisement -