- Advertisement -
హైదరాబాద్: ఎంఎల్ఎ క్రాంతికిరణ్, మాజీ ఎంఎల్ఎ వీరేశంలపై బిజెపి నేతల దాడిని మంత్రి కొప్పుల ఈశ్వర్ తీవ్రంగా ఖండించారు. బడుగు, బలహీన వర్గాల పట్ల బిజెపి ఎలా వ్యవహరిస్తుందో ఈ ఘటనతో అర్థమైందన్నారు. దాడికి పాల్పడ్డ వారిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిజిపి మహేందర్ రెడ్డిని కోరారు. టిఆర్ఎస్ దళిత ఎంఎల్ఎ చంటి క్రాంతి కిరణ్, మాజీ ఎంఎల్ఎ వీరేశంలపై బిజెపి నాయకులు, కార్యకర్తలు సోమవారం రాత్రి మూకుమ్మడిగా దాడి చేసిన విషయం తెలిసిందే.
- Advertisement -