ముంబయి: లాక్డౌన్ సమయంలో ఉద్యోగం పోవడంతో ఓ యువతి మూడు నెలల్లో ముగురిని పెళ్లి చేసుకొని మోసం చేసిన సంఘటన మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… విజయ్ అమృత అనే మహిళ తన భర్తతో కలిసి ముకుంద్వాడి ప్రాంతంలో నివసిస్తోంది. లాక్డౌన్ సమయంలో తన భర్త ఉద్యోగం పోవడంతో ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. ఇదే అదునుగా భావించిన యువతి పెళ్లి పేరుతో ముగ్గురిని పెళ్లి చేసుకొని బంగారు, నగదుతో ఉడాయించేది. నాసిక్ జిల్లాలోని యోగేశ్ శిరస్త్ అనే వ్యక్తిని అమృత పెళ్లి చేసుకుంది. అతడిని నమ్మించి బంగారు ఆభరణాలు తీసుకొని మాయమైంది. రాయ్ఘడ్లోని కర్జాత్లో సందీప్ను రెండో పెళ్లి చేసుకుంది. అతడికి మాయమాటలు చెప్పి డబ్బు, నగలతో పారిపోయింది. ఇదే విధంగా మహారాష్ట్రలోని మరో వ్యక్తిని పెళ్లి చేసుకొని మోసం చేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మూడు కేసులను పరిశీలించిన పోలీసులు చాకచక్యంగా నిందితురాలిని పట్టుకున్నారు.
మూడు నెలల్లో మూడు పెళ్లిలు… బంగారం, నగదుతో పరార్
- Advertisement -
- Advertisement -
- Advertisement -