Saturday, May 4, 2024

విద్యుత్ సమస్యలను అధిగమించాలి

- Advertisement -
- Advertisement -

గద్వాల ప్రతినిధి: రానున్న వర్షాకాంలో వ్యవసాయానికి విద్యుత్ సమస్య తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని జిల్లా విద్యుత్ కార్యాలయంలో విద్యుత్ ఎస్‌ఈ భాస్కర్‌ను గద్వాల ఎమ్మెల్యే మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా వ్యవసాయానికి ప్రధానంగా కరెంటు అవసరమని ,ఇంటర్మీడియట్ పోల్స్, ఎల్‌టీ లైన్ పోల్స్ యొక్క స మస్యలను పరిష్కారానికి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని, పోల్స్‌కు బడ్జె ట్ మంజూరు చేయాల్సిందిగా అధికారులకు విన్నపించారు. అదే విధంగా గ్రామాల్లో రైతులకు ట్రాన్స్‌ఫార్మర్‌లు సమస్య ఉందని, కొరత తీర్చాలని కోరారు. ఈ కార్యక్ర మంలో ఎంపీపీలు విజయ్, ప్రతాప్‌గౌడ్, పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News