Tuesday, April 30, 2024

భారత బౌలర్ల విజృంభణ.. 98 పరుగులకే 8 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్‌: భారత్‌తో జరుగుతున్న డే/నైట్‌ టెస్టులో ఇంగ్లండ్ జట్టు 98 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. భారత స్పిన్నర్లు అశ్విన్, అక్షర్ పటేల్ ల ధాటికి ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్లు క్రీజులో నిలువలేక వరుసగా పెవిలియన్ కు క్యూ కడుతున్నారు. డొమినిక్‌ సిబ్లే(0), జానీ బెయిర్ స్టో(0)లు డకౌట్ కాగా, కెప్టెన్ జోరూట్(17), బెన్ స్టోక్స్(06), ఒలీ పోప్(1), జాక్ లీచ్(3), అర్చర్(11)లు ఘోరంగా విఫలమయ్యారు. అయితే, ఓపెనర్ జాక్ క్రాలే(53) ఒక్కడే అర్థ శతకంతో రాణించాడు. దీంతో ఇంగ్లండ్ జట్టు 40 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 101 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో బెన్ ఫోక్స్(), స్టువర్ట్ బ్రాడ్()లు ఉన్నారు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ నాలుగు, అశ్విన్ మూడు వికెట్లతో చెలరేగగా.. ఇశాంత్ శర్మ ఒక వికెట్ తీశాడు.

Eng lost 8 wickets at 98 runs in 3rd test against Ind

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News