Friday, April 26, 2024

పెరగనున్న ఇంజినీరింగ్ ఫీజులు

- Advertisement -
- Advertisement -

Engineering fees in state are going to increase hugely

హైకోర్టును ఆశ్రయించి మధ్యంతర
ఉత్తర్వులు పొందిన ప్రైవేట్ కాలేజీలు
తుది తీర్పుకు లోబడి ఉండాలని
ఉన్నత న్యాయస్థానం ఆదేశం

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఇంజినీరింగ్ ఫీజులు భారీగా పెరగనున్నాయి. ప్రముఖ కాలేజీలు సహా 36 కాలేజీల్లో ఫీ జు లక్ష రూపాయలు దా టింది. ఏడు కళాశాలల్లో ఫీ జు లక్షన్నర మించింది. రా ష్ట్ర ప్రభుత్వం ఫీజులపై ఉత్తర్వులు ఇవ్వకుండానే కౌన్సెలింగ్ ప్రారంభించడంతో.. కళాశాలలు హైకోర్టును ఆ శ్రయించి మధ్యంతర ఉత్తర్వులు పొందాయి. ఇప్పటివరకు 80 ఇంజినీరింగ్ కాలేజీలు హైకోర్టు నుంచి అనుమతి పొందగా.. మరికొన్ని కాలేజీలు అదే బాట పట్టేందుకు సిద్ధమవుతున్నాయి. రా ష్ట్రంలో మూడేళ్లకోసారి ఇంజినీరింగ్ ఫీజులను సవరిస్తారు. మూ డేళ్లు పూర్తి కావడంతో ఈ ఏడాది ఫీజుల సమీక్ష కోసం రాష్ట్ర ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ(టిఎఎఫ్‌ఆర్‌సి) నోటిఫికేషన్ ఇచ్చింది. కాలేజీలు ఫీజులు పెంచుతూ ప్రతిపాదనలు సమర్పించగా, యాజమాన్యాలను టిఎఎఫ్‌ఆర్సీ అధికారులు పిలిపించి చర్చించారు. ఆ సం దర్భంలో కళాశాలల యాజమాన్యాలు అం గీకరించిన ఫీజులను టిఏఎఫ్‌ఆర్‌సి రిజిస్టర్‌లో నమోదు చేసింది.

అయితే కరోనా పరిస్థితు లు, ప్రజల ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది పాత ఫీజులను కొనసాగించాలని నిర్ణయించిన టిఏఎఫ్‌ఆర్సీ ప్రభుత్వానికి నివేదిక పంపించిం ది. ప్రభుత్వం దానిపై తుది నిర్ణయం తీసుకోకముందే.. గత నెల 21 నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభించడంతో పలు కా లేజీలు హైకోర్టును ఆశ్రయించాయి. టిఏఎఫ్‌ఆర్సీ ఎదుట తాము అంగీకరించిన ఫీజు ల వసూలు అనుమతించాలని కోరాయి. ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వకపోవడం.. మరోవైపు కౌన్సెలింగ్ ప్రారంభమైనందున.. ప్రవేశాల్లో ఆలస్యం జరగకుం డా మధ్యంతర ఉత్తర్వులు ఇస్తున్నట్లు హై కోర్టు తెలిపింది. టిఎఎఫ్‌ఆర్సీ వద్ద అంగీకరించిన ఫీజులను వసూలు చేసేందుకు కాలేజీలకు అనుమతినిచ్చింది. అయితే వసూలు చే సిన ఫీజులు పిటిషన్‌పై తుది తీర్పునకు లోబ డి ఉండాలని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చే సింది. పాత ఫీజులకు, కొత్త వాటికి మధ్య పెరిగిన సొమ్మును కాలేజీల బ్యాంకు ఖా తాల్లోనే ఉంచాలని.. ఒకవేళ తుది తీర్పు కళాశాలలకు వ్యతిరేకంగా వస్తే విద్యార్థుల కు తిరిగి చెల్లించాలని హైకోర్టు తెలిపింది. హైకోర్టు మ ధ్యంతర ఉత్తర్వుల మేరకు సిబిఐటిలో రూ. 1.75 లక్షలు, వాసవి, వర్దమా న్, సీవీఆర్, బీవీఆర్‌ఐటీ మహిళ కాలేజీలో రూ.1.55 లక్షలు, శ్రీనిధి, వీఎన్‌ఆర్ విజ్ఞా న్ జ్యోతిలో లక్షన్నర, ఎంవిఎస్‌ఆర్‌లో రూ.1.45 లక్షలకు చేరింది. అయితే హైకోర్టు ఆదేశాల మేర కు ఫీజు ఎంత మేర పెరిగిందనే వివరాలను కౌన్సెలింగ్ సమయం లో అధికారులు వెల్లడించకపోవడంతో నెలకొంది.

నేడు మొదటి విడత కేటాయింపు

ఎంసెట్ కౌన్సెలింగ్‌లో భాగంగా మంగళవారం(సెప్టెంబర్ 6) మొదటి విడత ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు జరగనుంది. సీట్లు పొందిన అభ్యర్థులు ఈనెల 13 వర కు ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించి సెల్ఫ్ రిపోర్టిం గ్ చేయా ల్సి ఉంటుంది. వెబ్‌సైట్‌లో ఇంజనీరింగ్ బ్రాంచీ, కాలేజీ వివరాలతో పాటు ఫీజులు పొందుపరచాల్సి ఉండగా, సంబంధించిన అధికారిక ఉత్తర్వులు వెలువడలేదు. వెబ్‌సైట్‌లో పాత ఫీజులు అందుబాటులో ఉన్నా యి. మొదటి విడత సీట్ల కేటాయింపు నాటికి ఉత్తర్వులు వెలువడకపోతే విద్యార్థులు పాత ఫీజులే చెల్లించాల్సి ఉంటుందని, మార్పులు ఉంటే అందుకనుగుణంగా ఫీజులు చెల్లించేలా షరతు విధించనున్నట్లు అధికారులు చెబుతున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News