Tuesday, April 30, 2024

112 పరుగులకే కుప్పకూలిన ఇంగ్లండ్

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్‌: మొతెర స్టేడియం వేదికగా జరుగుతున్న డే/నైట్‌ టెస్టులో ఇంగ్లండ్ జట్టు కేవలం 112 పరుగులకే కుప్పకూలింది. భారత స్పిన్నర్లు అశ్విన్, అక్షర్ పటేల్ ల ధాటికి ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్లు క్రీజులో నిలువలేక వరుసగా పెవిలియన్ కు క్యూ కట్టారు. ఓపెనర్ జాక్ క్రాలే(53) అర్థ శతకంతో రాణించినా.. డొమినిక్‌ సిబ్లే(0), జానీ బెయిర్ స్టో(0)లు డకౌట్ కాగా, కెప్టెన్ జోరూట్(17), బెన్ స్టోక్స్(06), ఒలీ పోప్(1), జాక్ లీచ్(3), అర్చర్(11), బెన్ ఫోక్స్(12), స్టువర్ట్ బ్రాడ్(3)లు ఘోరంగా విఫలమయ్యారు. దీంతో ఇంగ్లండ్ జట్టు తొలి ఇన్నింగ్స్ లో 48.4 ఓవర్లలో 112 పరుగులకు ఆలౌట్ అయ్యింది. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ ఆరు వికెట్లతో చెలరేగగా.. అశ్విన్ మూడు వికెట్లు, ఇశాంత్ శర్మ ఒక వికెట్ తీశారు.

England all out at 112 Runs in 3rd test against India

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News