Tuesday, April 30, 2024

డకెట్ ఔట్… ఇంగ్లాండ్ 266/5

- Advertisement -
- Advertisement -

రాజ్‌కోట్: సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్ మూడో రోజు ఇంగ్లాండ్ జట్టు 53 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 266 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. టీమిండియా ఇంకా 179 పరుగుల ఆధిక్యంలో ఉంది. బెన్ డకెట్ భారీ సెంచరీతో చెలరేగాడు. డకెట్ 153 పరుగులు చేసి కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో శుబమన్ గిల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. జానీ బయిర్ స్ట్రో కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో ఎల్‌బిడబ్ల్యు రూపంలో ఔటయ్యాడు. ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్లలో డకెట్(153), ఓలీ పోప్(39), జోయ్ రూట్(18), జాక్ క్రాలే(15) పరుగులు చేశారు. ప్రస్తుతం క్రీజులో బెన్ స్టోక్స్(25), బెన్ ఫోక్స్(0) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ చెరో ఒక వికెట్ తీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News