Monday, May 13, 2024

ఆరో వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఉప్పల్ స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మొదటి రోజు ఇంగ్లాండ్ 43 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 137 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. జానీ బయిర్‌స్టో 37 పరుగులు చేసి అక్షర పటేల్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. జోయ్ రూట్ 29 పరుగులు చేసి రవీంద్ర జడేజా బౌలింగ్‌లో బుమ్రాకు క్యాచ్ ఇచ్చి ఐదో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. బెన్ ఫోక్స్ నాలుగు పరుగులు చేసి అక్షర పటేల్ బౌలింగ్‌లో శ్రీకర్ భరత్‌కు క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా బౌలర్లలో రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అక్షర పటేల్ తలో రెండు వికెట్లు తీశారు. ప్రస్తుతం క్రీజులో బెన్ స్టోక్స్ (8), రెహన్ అహ్మద్(0) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News