Tuesday, April 30, 2024

ఇంగ్లండ్ సిరీసే కీలకం: ఆకాశ్ చోప్రా

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఇంగ్లండ్‌తో జరిగే సిరీస్ టీమిండియాకు చాలా కీలకమని భారత మాజీ క్రికెటర్, ప్రముఖ విశ్లేషకుడు ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు. న్యూజిలాండ్‌తో జరిగే డబ్లూటిసి ఫైనల్ కంటే ఇంగ్లండ్ సిరీస్‌లో భారత్ గెలవాలని తాను కోరుకుంటున్నట్టు చెప్పాడు. ఇంగ్లండ్‌ను వారి సొంత గడ్డపై ఓడిస్తే ప్రపంచ క్రికెట్‌లో భారత్ తిరుగులేని శక్తిగా ఎదగడం ఖాయమన్నాడు. ఇప్పటికే ఆస్ట్రేలియాను వారి సొంత గడ్డపై చిత్తుగా ఓడించిన టీమిండియా ఈ సిరీస్‌లోనూ గెలిస్తే మరింత బలమైన జట్టుగా అవతరిస్తుందన్నాడు. కొన్నేళ్లుగా ఇంగ్లండ్ గడ్డపై జరుగుతున్న సిరీస్‌లలో టీమిండియాకు అవమానకర ఓటములు ఎదురవుతున్నాయన్నాడు. ఇది తనను ఎంతో మనోవేదనకు గురిచేసిందన్నాడు. ఈసారి మాత్రం అలాంటి ఫలితాలకు తావులేకుండా భారత్ మెరుగైన ఆటతో సిరీస్‌ను సొంతం చేసుకోవాలని తాను కోరుకుంటున్నట్టు చోప్రా వ్యాఖ్యానించాడు.

England Series more than to New zealand

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News