Friday, April 19, 2024

ప్రతీ సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తా

- Advertisement -
- Advertisement -

కూకట్‌పల్లి : డివిజన్‌లోని బస్తీల్లో నెలకొన్న ప్రతీ సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తానని కూకట్‌పల్లి కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ అన్నారు. మంగళవారం డివిజన్‌లోని చాకలి బస్తీలో పాదయాత్ర చేసిన ఆయన స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తన దృష్టికి వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఏఈ శివప్రకాష్. వర్క్ ఇనిస్పెక్టర్ సూర్యంతో పాటుగా స్థానిక నేతలు, బస్తీ వాసులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News