Friday, May 10, 2024

కల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం

- Advertisement -
- Advertisement -

కల్లూరు : కల్లూరు జాతీయ రహదారిపై రెండు డిసిఎం వ్యాన్లు ఢీకొని భారీ ప్రమాదం సంభవించి ఇద్దరు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే బుధవారం కల్లూరు పట్టణంలోని ఖాన్ ఖాన్ పేట వద్ద ఖమ్మం నుండి వస్తున్న డీసీఎం వ్యాను సత్తుపల్లి నుంచి వస్తున్న డీసీఎం వ్యాన్ రెండు ఢీకొనడంతో నుజ్జు నుజ్జయి పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదంలో క్యాబిన్లో ఇరుక్కున్న డ్రైవర్‌ను స్థానికులు బయటకు తీసేందుకు శతవిధాలా ప్రయత్నం చేసి ప్రాణాలతో బయటకు తీసినా గాని ప్రాణాపాస్థితిలో కొట్టుమిట్టాడుతూ ఉండగా వెంటనే ఇరువురిని ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News