Tuesday, April 30, 2024

డబ్బుల కోసం కోడలిని హతమార్చిన మామ

- Advertisement -
- Advertisement -

Father in law murdered Daughter in law

 

అమరావతి: భర్త చనిపోయాడు… పరిహారం కింద వచ్చిన డబ్బులు అడిగినందుకు కోడలిని మామ హతమార్చడంతో అతడిని రిమాండ్‌కు తరలించిన సంఘటన అనంతపురం జిల్లా గుంతకల్లు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. చెట్టప్పబావి వీధిలో మల్లిఖార్జున అనే వ్యక్తి కుమారుడు మూడేళ్ల కిత్రం చనిపోయాడు. దీంతో ఆమె కోడలు జ్యోతి తన పుట్టింటికి వెళ్లిపోయింది. కుమారుడు చనిపోవడంతో బీమా డబ్బు, పరిహారం కింద పది లక్షల రూపాయలు రావడంతో మల్లిఖార్జున తన వద్దే ఉంచుకున్నాడు. తన వాటా తనకు ఇవ్వాలని కొన్ని రోజుల నుంచి మామను కోడలు అడుతూ వస్తుంది. దీంతో ఇద్దరు మధ్య మనస్పర్థలు కూడా ఏర్పడ్డాయి. నవంబర్ 1న ఇంటికి కోడలిని రప్పించుకొని రొకలిబండతో ఆమెపై దాడి చేశాడు. ఆమె ఘటనా స్థలంలో చనిపోవడంతో అక్కడి నుంచి పారిపోయాడు. పోలీసులు కేసు నమోదు నిందితుడు కోసం గాలించగా మంగళవారం దొరకడంతో రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News