Wednesday, May 8, 2024

కోడలితో వివాహేతర సంబంధం… కుమారుడిని చంపిన తండ్రి

- Advertisement -
- Advertisement -

Father killed son over illicit relationship with daughter in law

అమరావతి: కోడలితో వివాహేతర సంబంధం పెట్టుకొని కుమారుడిని కన్న తండ్రి హత్య చేసిన సంఘటన ప్రకాశం జిల్లా సంతమగులూరు మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కరుణయ్య- మరియమ్మ అనే దంపతులు ఏల్చూరు ఎస్సీ కాలనీలో నివసిస్తున్నారు. ఈ దంపతులకు లక్ష్మయ్య(35) అనే కుమారుడు ఉన్నాడు. 15 సంవత్సరాల క్రితం లక్ష్మయ్యకు సునీతకు పెళ్లి జరిగింది. లక్ష్మయ్య-సునీత దంపతులకు ఇద్దరు కమారులు ఉన్నారు. కరుణయ్య తన కోడలు సునీతతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. తన కుమారుడు అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని హత్య చేయాలని ప్లాన్ వేశారు. ఆదివారం అర్ధ రాత్రి సమయంలో లక్ష్మయ్య గాఢ నిద్రలోకి జారుకోగానే అతడిపై తండ్రి కత్తులతో దా చేసి హత్య చేశాడు. లక్ష్మయ్య పెద్ద కుమారుడు ఈ దారుణం చూడడంతో వెలుగులోకి వచ్చింది. గ్రామస్థుల సమాచారం మేరకు సిఐ రాజేష్, ఎస్‌ఐ శివ నారాయణ ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News