- Advertisement -
జైపూర్: టెంపులో ఏడేళ్ల బాలికపై మద్యం మత్తులో కన్న తండ్రి అత్యాచారం చేసిన సంఘటన రాజస్థాన్లోని ఉదయ్పూర్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గోవర్ధన్ విలాస్లో 36 ఏళ్ల వ్యక్తి టెంపో నడుపుతూ జీవనం సాగించేవాడు. భార్య భర్తల మధ్య గొడవలు రావడంతో ఆమెను తన తల్లిగారింటికి వెళ్లిపోయింది. భార్య దగ్గరకు వెళ్లి తనతో రావాలని కోరాడు, ఆమె నిరాకరించడంతో తల్లి షాపుకు వెళ్లగానే కూతురుని తీసుకొని వెళ్లిపోయాడు. టెంపోలోకి తీసుకెళ్లిన తరువాత ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అపస్మారక స్థితిలో ఉన్న కూతురును గుర్తించి ఆస్పత్రికి తల్లి తరలించింది. జరిగిన విషయం తల్లికి కూతురు చెప్పడంతో ఆమె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోస్కో యాక్ట్ కింద కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని డిఎస్పి ప్రేమ్ ధాండే తెలిపాడు.
- Advertisement -