Friday, April 26, 2024

ఔటర్ రింగ్ రోడ్డుపై కారు దగ్ధం….

- Advertisement -
- Advertisement -

రంగారెడ్డి: శంషాబాద్ లోని ఔటర్ రింగ్ రోడ్డుపై కారులో మంటలు చెలరేగాయి. శంషాబాద్ నుండి గచ్చిబౌలి వెళ్తుండగా ఔటర్ రింగ్ రోడ్డు పై ఎయిర్ పోర్ట్ కాలనీ వద్దకు రాగానే ఒక్కసారిగా కారు ఇంజన్ లో నుంచి మంటలు చెలరేగాయి. కారు డ్రైవర్ మంటల్లో చిక్కుకపోవడంతో అదే మార్గం నుంచి వెళ్తున్నా లారీ, ఆటో డ్రైవర్ గమనించి మంటల్లో చిక్కుకున్న డ్రైవర్ ను బయటకు తీశారు. కారు డ్రైవర్ ను 108 వాహనంలో స్థానిక ఆస్పత్రికి తరలించారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశారు. గాయపడిన వ్యక్తి రంగారెడ్డి జిల్లా కొత్తుర్ మండలం తిమ్మాపూర్ కు చెందిన శ్రీకాంత్ గా గుర్తించారు. శ్రీకాంత్ మంటల్లో చిక్కుకుని తీవ్రంగా గాయపడడంతో అతడి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News