Friday, April 26, 2024

పాక్‌లో తొలి ఒమిక్రాన్ కేసు నమోదు

- Advertisement -
- Advertisement -

first omicron case was registered in Pakistan

ఇస్లామాబాద్ : కరాచీకి చెందిన 57 ఏళ్ల మహిళకు ఒమిక్రాన్ వేరియంట్ సోకినట్టు పాకిస్థాన్ లోని అగ్రస్థాయి యాంటీ కరోనా వైరస్ పాలక వర్గం నేషనల్ కమాండ్ అండ్ ఆపరేషన్ సెంటర్ (ఎన్‌సిఒసి) సోమవారం నిర్ధారించింది. పాకిస్థాన్‌లో ఇదే మొదటి ఒమిక్రాన్ కేసు. ఇంతవరకు కరోనా టీకా తీసుకోని బాధితురాలు ఆగాఖాన్ యూనివర్శిటీ ఆస్పత్రిలో గతవారం చేరగా, జీనోమ్ సీక్వెన్సింగ్ ద్వారా ఒమిక్రాన్ వేరియంట్‌ను గుర్తించినట్టు ఇస్లామాబాద్‌కు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వెల్లడించింది. బాధితురాలు ప్రస్తుతం ఇంటివద్దనే క్షేమంగా ఉందని, అన్ని పనులు చేసుకుంటోందని ఆస్పత్రి ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News