Saturday, April 27, 2024

యుఎస్ దాడుల్లో ఐదుగురు మృతి

- Advertisement -
- Advertisement -

యెమెన్ హౌతీ రెబెల్స్ ఆరోపణ

దుబాయి : యెమెన్‌పై అమెరికా సారథ్యంలో జరిగిన వైమానిక దాడుల్లో కనీసం ఐదుగురు వ్యక్తులు హతులయ్యారని, మరి ఆరుగురు గాయపడ్డారని హౌతీ తిరుగుబాటుదారుల మిలిటరీ అధికార ప్రతినిధి శుక్రవారం ఆరోపించారు. బ్రిగేడియర్ జనరల్ యాహ్యా సరీ ఒక వీడియో సందేశంలో ఈ ప్రకటన చేశారు. ‘అమెరికన్, బ్రిటిష్ శత్రువులు మా యెమెనీ ప్రజలపై తమ నేరపూరిత దాడికి పూర్తి బాధ్యత వహించవలసి ఉంటుంది. దీనికి మా సమాధానం తప్పదు. శిక్షకూ వారు పాత్రమే’ అని సరీ స్పష్టం చేశారు. అయితే, అమెరికా సారథ్యంలని విమాన దాడుల లక్షం ఏమిటో ఆయన వివరించలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News