- Advertisement -
ముంబై: ఆస్ట్రేలియా పర్యటనలో ఐదు టెస్టు మ్యాచ్లు ఆడడం కష్టమేనని భారత క్రికెట్ బోర్డు అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డాడు. డిసెంబర్లో ఆస్ట్రేలియాలో పర్యటించాల్సిన భారత్ బోర్డర్గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాలుగు టెస్టు మ్యాచులు ఆడాల్సి ఉంది. అయితే సిరీస్లో ఐదు టెస్టులు ఆడాలనే ప్రతిపాదనను క్రికెట్ ఆస్ట్రేలియా బిసిసిఐ ముందు ఉంచింది. దీనిపై గంగూలీ ఈ విధంగా స్పందించాడు. సిరీస్లో నాలుగు టెస్టులతో పాటు మూడు వన్డేలు కూడా ఆడాల్సి ఉంది. అంతేగాక కరోనా నేపథ్యంలో ఆటగాళ్లు రెండు వారాల పాటు క్వారంటైన్లో ఉండాల్సి ఉంటుంది. ఇక, మరో టెస్టు ఆడాలంటే సిరీస్ను మరింత పొడిగించాల్సి వస్తోంది. ఇది ఆచరణలో సాధ్యం కాదని గంగూలీ స్పష్టం చేశాడు.
- Advertisement -