మెగాస్టార్ చిరంజీవి, యంగ్ డైరెక్టర్ సుజిత్ కలయికలో ‘లూసిఫర్’ తెలుగు రీమేక్ రానున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా స్క్రిప్ట్ పనుల పర్యవేక్షణలో ప్రస్తుతం బిజీగా ఉన్నారు మెగాస్టార్. కరోనా లాక్ డౌన్ సమయంలో దర్శకుడు సుజిత్తో చిరంజీవి వీడియో కాల్స్ ద్వారా సినిమా స్క్రిప్ట్కి సంబంధించి చర్చలు జరుపుతున్నారు. కాగా తెలుగు ప్రేక్షకులు కోరుకునే ఎమోషన్స్కి తగ్గట్టుగా ‘లూసిఫర్’ స్క్రిప్ట్లో మెగాస్టార్ కొన్ని కీలకమైన మార్పులను సూచించారని తెలిసింది.
ఈ మేరకు సుజిత్ ఆ మార్పులను పూర్తి చేసి చిరుకి స్క్రిప్ట్ వినిపించాడని… ఫైనల్గా చిరు స్క్రిప్ట్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిసింది. ముఖ్యంగా హీరోయిజమ్ ఎలివేషన్స్ ఉన్న సన్నివేశాలు సినిమాలోనే మెయిన్ హైలైట్గా నిలుస్తాయని.. మెగా అభిమానులకు ఫుల్ జోష్ని ఇచ్చేలా ఇవి ఉంటాయని సమాచారం. ఇక గత ఏడాది సుజిత్ దర్శకత్వంలో వచ్చిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘సాహో’ మంచి విజయాన్ని అందుకుంది. దీంతో చిరంజీవి… ఈ యంగ్ డైరెక్టర్ టాలెంట్పై నమ్మకముంచి అతనికే ‘లూసిఫర్’ మూవీ రీమేక్ బాధ్యతలు అప్పగించారు.