- Advertisement -
న్యూఢిల్లీ: మహిళలకు కూడా ఐపిఎల్ తరహాలో పూర్తి స్థాయి ట్వంటీ20 టోర్నమెంట్ నిర్వహించాలని భారత స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన సూచించింది. భారత మహిళా క్రికెట్ ప్రమాణాలు మరింత పెరగాలంటే ఇలాంటి టోర్నీ నిర్వహించడమే సరైన పరిష్కారమని అభిప్రాయపడింది. పురుషులతో పోల్చితే మహిళా క్రికెట్ చాలా వెనుకబడి ఉందని వాపోయింది. ఐపిఎల్ రాకతో భారత పురుషుల జట్టు రూపు రేఖలే మారిపోయాయని, ఈ టోర్నీ ద్వారా ఎందరో ప్రతిభావంతులైన క్రికెటర్లు వెలుగులోకి వచ్చారని గుర్తు చేసింది. మహిళా క్రికెట్ను బలోపేతం చేయాలంటే తమకు కూడా ఐపిఎల్లాంటి టోర్నీ అవసరమని చెప్పింది. ఐదారు జట్లతో మహిళల ఐపిఎల్ను నిర్వహించాలని మంధాన బిసిసిఐని కోరింది.
- Advertisement -