Saturday, April 27, 2024

కడెం ప్రాజెక్టులోకి ఐదువేల క్యూసెక్కుల వరదనీరు

- Advertisement -
- Advertisement -

కడెం: గత మూడు రోజుల్లో కురుస్తున్న వర్షాలకు కడెం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా బుధవారం ఐదువేల క్యూసెక్కుల వరదనీరు రావడంతో 690 అడుగులకు చేరుకోవడంతో కడెం ప్రాజెక్టు సందర్శించిన ప్రాజెక్టు ఈ ఈ విటల్ ప్రత్యేక పూజలు చేసిన అనంతరం 9వ నంబర్ గేటు ఎత్తి 2900 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదిలేస్తున్నట్లు ఆయన తెలియజేశారు. ఇంకా రెండు మూడు రోజులు వర్షం పడే అవకాశం ఉన్నందున ఒక ఒకగేటు ఎత్తి గోదావరిలోకి నీటిని వదిలేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట డిఈ బోజాదస్, జెఇలు రవికుమార్, గణేష్, తదితర సిబ్బంది ఉన్నారు..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News