Tuesday, May 7, 2024

మై హోమ్ సిమెంట్ ఫ్యాక్టరీలో ప్రమాదం: ఐదుగురు మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువులోని మైహోం సిమెంట్ ఫ్యాక్టరీలో మంగళవారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో ఐదుగురు మృతిచెందారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశమున్నట్లు సమాచారం. బాధితులు ఉత్తర్ ప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు చెందినవారుగా తెలుస్తోంది. అనుమతి లేకుండా నూతనంగా నిర్మిస్తున్న యూనిట్-4 ప్లాంట్ వద్ద ప్రమాదఘటన జరిగింది. 500 అడుగుల ఎత్తులో కాంక్రీట్ వర్క్ చేస్తుండగా లిఫ్ట్ కూలి కాంట్రాక్ట్ కార్మికులు కిందపడిపోయారు. మై హోమ్ యాజమాన్యం ఈ ప్రమాదంపై గోప్యత పాటిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News