- Advertisement -
నిర్విరామంగా 14 రోజులు కరోనా రోగులకు సేవలందించిన విజయశ్రీపై పూలవర్షం
మన తెలంగాణ/సిటీబ్యూరో : నగరంలోని గాంధీ ఆసుపత్రిలో కరోనా వైరస్ సోకిన రోగులకు 14 రోజుల పాటు వైద్యం అందించి వైద్యురాలు విజయశ్రీకి ఇంటికి రాగానే ఇరుగుపొరుగు ప్రజలు చప్పట్లు, పూలు చల్లుతూ ఘన స్వాగతం పలికారు. కరోనా సోకిన ఎంతో మంది రోగులకు ప్రాణం పోసి తమ ప్రాణాలను పణంగా పెట్టిన ఆమె సేవలను వారు కొనియాడారు. వైద్యులే నిజమైన దేవుళ్లు అని ఆమెను పొగడ్తలతో ముంచెత్తారు. తన సేవలకు ఏనాడు ఈస్దాయిలో ఆదరణ లభించలేదని విజయశ్రీ ఆనంద బాష్పాలు రాల్చారు. రోగుల పట్ల వైద్యులు ఎంతో ప్రేమతో ఉంటారని, వారి కాపాడటమే తమ కర్తవ్యమని ఆమె వెల్లడించారు.
Floral Rain on Vijaya sree
- Advertisement -