- Advertisement -
హైదరాబాద్: ఫుడ్ డెలివరీ బాయ్కు కరోనా సోకిందనే విషయం తెలియగానే హైదరాబాద్ వాసులు భయంతో వణికిపోతున్నారు. నాంపల్లి లక్ష్మీ నగర్ ప్రాంతానికి చెందిన యువకుడి లాక్డౌన్ నేపథ్యంలో పలు ఇండ్లకు ఫుడ్ డెలివర్ చేశాడు. తాజాగా ఆ యువకుడి తండ్రి మర్కజ్ వెళ్లి వచ్చినట్టు వైద్యులు గుర్తించి కరోనా టెస్టు చేయగా పాజిటివ్ అని తేలింది. దీంతో తండ్రిని ఐసోలేషన్ వార్డుకు తరలించారు. కుటుంబ సభ్యులను క్వారంటైన్కు తరలించారు. ఆ యువకుడి పాజిటివ్ రావడంతో అధికారులు అతడు ఎన్ని ఇళ్లకు ఫుడ్ డెలివరీ చేసిన వివరాలను సేకరిస్తున్నారు. అంతేకాకుండా ఆ యువకుడితో సన్నిహితంగా మెలిగిన డెలివర్ బాయ్స్ను క్వారంటైన్ తరలించారు. ఆ యువకుడు మొత్తం 25 ఇండ్లకు ఫుడ్ డెలివరి చేసినట్టు గుర్తించారు.
Food delivery boy Corona positive in hyderabad
- Advertisement -