Friday, May 10, 2024

24 గంటల్లో 1334 కొత్త కరోనా కేసులు: లవ్ అగర్వాల్

- Advertisement -
- Advertisement -

 

ఢిల్లీ: గడిచిన 24 గంటల్లో 1334 కొత్త కరోనా కేసులు నమోదుకాగా 24 మంది చనిపోయారని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. ఆదివారం లవ్ అగర్వాల్ మీడియాతో మాట్లాడారు. భారత్‌లో 15,712 మంది కరోనా వైరస్ వ్యాపించగా 507 మంది మృతి చెందారన్నారు. భారత్‌లో ఇప్పటి వరకు కరోనా నుంచి 2231 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారని వెల్లడించారు. ఇప్పటి వరకు 3.86 లక్షల మందికి టెస్టులు చేశామని, గత 24 గంటల్లో 37 వేల మందికి కరోనా పరీక్షలు చేశామని ప్రకటించారు. తెలంగాణలో కరోనా రోగులు సంఖ్య 809కు చేరుకోగా 18 మంది మృతి చెందారు. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్‌ల సంఖ్య 647కు చేరుకోగా 17 మంది మరణించారు.

రాష్ట్రాలు & కేంద్రపాలితప్రాంతాలు బాధితులు కోలుకున్నవారు మృతులు
మహారాష్ట్ర 3,648 365 211
ఢిల్లీ 1,893 207 43
గుజరాత్
1,604 94 58
మధ్య ప్రదేశ్
1,402 127 69
రాజస్థాన్
1,395 205 22
తమిళనాడు 1,372 365 15
ఉత్తర ప్రదేశ్ 974 108 14
తెలంగాణ 809 186 18
ఆంధ్రప్రదేశ్
647 65 16
కేరళ 399 257 2
కర్నాటక
388 104 14
జమ్ము కశ్మీర్
341 51 5
పశ్చిమ బెంగాల్ 310 62 12
పంజాబ్
234 31 16
హర్యానా 232 100 3
బిహార్
87 42 2
ఒడిశా 61 24 1
ఉత్తరాఖండ్ 42 9
హిమాచల్ ప్రదేశ్
39 16 2
ఛత్తీస్ గఢ్ 36 25
అస్సాం 34 12 1
ఝార్ఖండ్
33 2
ఛండీగఢ్
23 9
లడఖ్
18 14
అండమాన్ నికోబార్ దీవులు
14 11
మేఘాలయ
11 1
గోవా
7 6
పుదుచ్చేరీ 7 4
మణిపూర్ 2 1
త్రిపుర
2 1
అరుణాచల్ ప్రదేశ్
1 1
మిజోరం
1
నాగాలాండ్
1
మొత్తం 16,067 2,502 527
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News