Monday, April 29, 2024

దుబాయిలో చిక్కుకున్న భార్య, పిల్లలు.. ఆందోళనలో బాలీవుడ్ హీరో

- Advertisement -
- Advertisement -

 

మహమ్మారి కరోనా వైరస్(కోవిడ్-19) విజృంభిస్తుండడంతో ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు లాక్‌డౌన్‌ విధించాయి. దీంతో ఎక్కడి వారు అక్కడే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. బాలీవుడ్ హీరో సంజయ్ దత్ భార్య, పిల్లలు కూడా దుబాయిలో చిక్కుకుపోయారు. దీంతో సంజయ్ దత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. లాక్‌డౌన్ ముందు సంజయ్ దత్ భార్య మాన్యత, పిల్లలు దుబాయి వెళ్లారు. ఈ క్రమంలో కరోనా ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న నేపథ్యంలో భారత్ తోపాటు దుబాయిలోనూ లాక్‌డౌన్ ప్రకటించడంతో వాళ్లు అక్కడే చిక్కుకుపోయారు. తాజాగా సంజయ్ దత్ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన భార్య, పిల్లలను చాలా మిస్సవుతున్నట్లు అవేదన వ్యక్తం చేశారు. గతంలో పలుమార్లు తన కుటుంబానికి దూరంగా ఉన్నానని.. ఇప్పడు కూడా అదే జరిగిందని, ఇంట్లో ఒంటరిగా ఉన్నానని తన భాదను వెల్లడించారు. అయినా, తన భార్య, పిల్లలను చూసి, రోజులో పలుమార్లు వారితో మాట్లాడుతున్నానని, నా భాదను తీర్చిన టెక్నాలజీకి ధన్యవాదాలు చెప్పాలన్నారు. ఇలాంటి సమయంలోనే జీవితం విలువ ఏంటో మనకు తెలుస్తోందని, ప్రియమైన వారితో మనం గడిపిన రోజులు గుర్తుకు వస్తాయన్నారు. ఓ తండ్రిగా, భర్తగా, నా పిల్లల విషయంలో కాస్త ఆందోళనగా ఉందని, వాళ్లు క్షేమంగానే ఉన్నా.. నా మనసు మాత్రం ఆగడం లేదన్నారు. ఈ లాక్‌డౌన్ సమయంలో నా భార్య, పిల్లలతో వీడియో కాల్స్‌తో మాట్లాడుతూ, చాటింగ్ చేస్తూ కాలక్షేపం చేస్తున్నాని చెప్పుకొచ్చారు.

Sanjay Dutt Misses his wife and kids stuck in Dubai

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News