Sunday, April 28, 2024

ప్రొద్దుటూరు మాజీ శాసన సభ్యుడు రమణారెడ్డి కన్నుమూత

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లా ప్రొద్దుటూరు మాజీ శాసనసభ్యుడు డాక్టర్ ఎంవి రమణారెడ్డి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ కర్నూలు ఆస్సత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. గతంలో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విభేదించి శాసనసభ సభ్యత్వానికి రమణ రాజీనామా చేశారు.  రాయలసీమ విమోచన సమితిని ఏర్పాటు చేయడంతో పాటు నిరంతరం రాయలసీమ హక్కుల కోసం ఆయన పోరాటం చేశారు. పలువురు నేతలు ఆయన మృతిపట్ల సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News