- Advertisement -
భోపాల్: మధ్యప్రదేశ్ మాజీ మంత్రి రామకాంత్ తివారీ అనారోగ్యంతో గురువారం సాయంత్రం చక్ఘాట్లోని తన నివాసంలో కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన నాలుగుసార్లు టియోంతర్ అసెంబ్లీ స్థానానికి ప్రాతినిధ్యం వహించాడు. ఉమాభారతి నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వంలో పశుసంవర్థక శాఖ మంత్రిగా పనిచేశారు. 80 ఏళ్ల తివారీకి ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. రామకాంత్ తివారీ పట్ల పలువురు నాయకులు సంతాపం తెలిపి, కుటుంబీకులను పరామర్శించారు.
- Advertisement -