Saturday, May 4, 2024

లారీని ఢీకొట్టిన కారు: నలుగురు మృతి

- Advertisement -
- Advertisement -

 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా మార్టూరు వద్ద గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు అతివేగంతో వచ్చి వెనక నుంచి లారీని ఢీకొట్టడంతో నలుగురు ఘటనా స్థలంలోనే దుర్మరణం చెందారు. పోలీసులు, జాతీయ రహదారి సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతులు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు వాసులుగా గుర్తించారు.  తిరుమల నుంచి ఏలూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News