Wednesday, May 1, 2024

చెట్టును ఢీకొట్టిన కారు: నలుగురు మృతి

- Advertisement -
- Advertisement -

భువనేశ్వర్: ఎస్‌యువి కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టడంతో నలుగురు మృతి చెందిన సంఘటన ఒడిశా రాష్ట్రంలోని కియోజన్‌జర్ జిల్లాలో గురువారం ఉదయం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మయూర్ భంజ్ జిల్లాలోని హతబదాలా గ్రామానికి చెందిన 11 మంది జిరాంగ్ కు కారులో వెళ్తుండగా హరిచందన్‌పూర్‌లోని జిరాంగ్‌లో ఇవాళ తెల్లవారుజామున వారి వాహనం చెట్టుకు ఢీకొట్టడంతో నలుగురు దుర్మరణం చెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను కియోజన్‌జర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News