Sunday, May 5, 2024

రాజస్థాన్‌లో విద్యుదాఘాతానికి నలుగురి మృతి

- Advertisement -
- Advertisement -

Four people die of electrocution in Rajasthan

కోట: రాజస్థాన్‌లోని ఝలావర్ జిల్లాలో గురువారం రెండు వేర్వేరు సంఘటనల్లో విద్యుదాఘాతానికి నలుగురు వ్యక్తులు మరణించారు. ఉన్హెల్ పోలీసు స్టేషన్ ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున పొలాలకు నీళ్లు వదిలేందుకు మోటారు పంపునకు స్విచ్ ఆన్ చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై నరేందర్ సింగ్ అనే 22 ఏళ్ల యువకుడు మరణించాడు. అతడిని రక్షించేందుకు ప్రయత్నించి అతని బామ్మ కమలా కన్వర్(62) కూడా విద్యుత్ షాక్‌కు గురై మరణించారు. ఘటోలి పోలీసు స్టేషన్ పరిధిలోని బడియా కిషోర్‌పురా గ్రామంలో బావిలో వాటర్ బూస్టర్ ఆన్‌చేస్తూ భులాబాయి గుర్జర్ అనే 32 ఏళ్ల మహిళ విద్యుదాఘాతంతో మరణించింది. ఆమెను రక్షించే ప్రయత్నంలో పనిమనిషి రామ్‌విలాస్ భీల్(25) కూడా మరణించింది. పోస్ట్‌మార్టమ్ అనంతరం ఆ నాలుగు మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.

Four people die of electrocution in Rajasthan Jhalawar

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News