షెడ్యూల్డ్ కులాల సహకార అభివృద్ధి సంస్థ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ లచ్చిరాంభూక్య
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలోని ఎస్సి నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ లచ్చిరాంభూక్య తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమాలకు 18 నుండి 35 సంవత్సరాల లోపు అర్హులైన నిరుద్యోగ యవత ఆయా జిల్లా ఎస్సి కార్పొరేషన్ కార్యాలయాలను సంప్రదించాలని సూచించారు. ఈ మేరకు దరఖాస్తులను 15వ తేదీ లోపు సమర్పించాలని వివరించారు. సివిల్ ఇంజనీరింగ్ పట్టభద్రులకు జాతీయ నిర్మాణ సంస్థ(న్యాక్) ఆధ్వర్యంలో శిక్షణ అందిస్తామని తెలిపారు. అలాగే పదవతరగతి, ఇంటర్ విద్యా అర్హత గల అభ్యర్థులకు షెఫ్ ట్రైనింగ్ కోర్సులల్లో జాతీయ పర్యాటక, అతిథ్య నిర్వహణ సంస్థ ద్వారా ఉచిత శిక్షణ అందిస్తారని వివరించారు. ఈ శిక్షణ కాలంలో ఉచిత భోజన వసతి కూడా అందిస్తారని పేర్కొన్నారు.