న్యూఢిల్లీ: టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్కు ఐపిఎల్ కొత్త ఫ్రాంచైజీ లక్నో కీలక బాధ్యతలు అప్పగించింది. తొలిసారి ఐపిఎల్లో అడుగిడుతున్న లక్నో టీమ్ తమ జట్టు మెంటార్గా గంభీర్ను నియమించింది. ఈ విషయాన్ని గంభీర్ శనివారం సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. తనపై ఎంతో నమ్మకంగా అప్పగించిన మెంటార్ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించేందుకు శాయశక్తుల కృషి చేస్తానని పేర్కొన్నాడు. ఇక తనకు మెంటార్గా నియమించిన జట్టు యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపాడు. తనపై నమ్మకంతో ఫ్రాంచైజీ యజమానికి డాక్టర్ గోయెంకా ఈ బాధ్యతలు అప్పగించడం ఆనందంగా ఉందన్నాడు. ఇక వీరి నమ్మకాన్ని నిలబెట్టేందుకు శాయశక్తుల కృషి చేస్తాననన్నాడు. ఇదిలావుండగా ఐపిఎల్లో గంభీర్కు అపార అనుభవం ఉంది. అతని సారథ్యంలోనే కోల్కతా నైట్రైడర్స్ రెండు సార్లు ఐపిఎల్ ట్రోఫీగా సాధించింది. దీంతో గంభీర్కు ఈ కీలకమైన బాధ్యతలు అప్పగించాలని గోయెంకా నిర్ణయించారు. ఇంతకుముందే లక్నో ప్రధాన కోచ్గా జింబాబ్వే దిగ్గజం ఆండీ ఫ్లవర్ను నియమించిన విషయం తెలిసిందే.