Friday, April 26, 2024

సెప్టెంబర్ 10వ తేదీ నుంచి గణేశ్ ఉత్సవాలు

- Advertisement -
- Advertisement -
Ganesh festival from September 10
19 తేదీన నిమజ్జనం
భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవంత్‌రావు

హైదరాబాద్: వినాయక ఉత్సవాలు సెప్టెంబర్10 నుంచి ప్రారంభం కానున్నాయని గణేశ్ ఉత్సవ కమిటీ తెలిపింది. 19 తేదీన నిమజ్జనం ఉంటుందని వెల్లడించింది. ఈ నెల 23న భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి కార్యాలయాన్ని ప్రారంభించనున్నట్లు భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవంత్‌రావు పేర్కొన్నారు. గణేశ్ ఉత్సవాలకు సంబంధించిన ముడిసరుకును సమయానికి అందించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. గణేశ్ ఉత్సవాలకు 24 రకాల మెడిసినల్ ప్లాంట్స్ ఉపయోగిస్తున్నట్లు భగవంతరావు పేర్కొన్నారు. నిమజ్జన సమయానికి రోడ్లు బాగుండేలా చేయాలని, త్రాగడానికి మంచినీరు ఉండేలా చూడాలని ఆయన జిహెచ్‌ఎంసీని కోరారు. గణేష్ ఉత్సవాల సమయంలో విద్యుత్ సరఫరా కట్ కాకుండా ప్రభుత్వం దృష్టి పెట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన కరోనా మార్గదర్శకాల ప్రకారం అన్ని మండపాల్లో జాగ్రత్తలు చేపడతామని ఆయన స్పష్టం చేశారు. మండపాల్లో దేశభక్తి, దైవభక్తి పాటలు మాత్రమే ఉండాలని ఆయన సూచించారు. గణేశ్ విగ్రహం ఎత్తు కోసం పోటీ పడకుండా కరోనా నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తగా వేడుకలు చేసుకోవాలని ఆయన తెలిపారు. గతేడాది మాదిరిగానే నిమజ్జన సమయంలో అందరూ భౌతికదూరం పాటించాలని భగవంత్‌రావు కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News