Tuesday, April 30, 2024

యువతిపై గ్యాంగ్ రేప్…. రూ.15 లక్షలతో పరార్

- Advertisement -
- Advertisement -

Gang rape on Young girl in West bengal

 

కోల్‌కతా: దుండగులు ఇంట్లోకి చొరబడి యువతిపై సామూహిక అత్యాచారం చేసి అనంతరం ఇంట్లో ఉన్న 15 లక్షల రూపాయలతో పారిపోయిన సంఘటన పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. గార్డెన్ రీచ్ ప్రాంతంలో బాధితురాలు ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ముగ్గురు దుండుగులు వచ్చారు. ఆమెను కట్టేసి గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. ఇంట్లో ఉన్న రూ.15 లక్షల నగదును ఎత్తుకెళ్లారు. వెంటనే ఆమె స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. ఆమెపై అత్యాచారం జరిగినట్లు నిర్ధారణ అయిందని పోలీస్ అధికారి వెల్లడించారు. ఆ ప్రాంతంలో సిసి ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News