- Advertisement -
న్యూఢిల్లీ: శుద్ధిగా ఉంటే గంగానదిలోని నీరు ఎక్కడైనా తాగడానికి పనికివస్తుందని ఆర్ఎస్ఎస్ మాజీ ప్రచారకుడు,బిజెపి నేత కెఎన్ గోవిందాచార్య అన్నారు. గంగానది ప్రాంతంలోని పర్యావరణాన్ని కాపాడాల్సి ఉన్నదని ఆయన సూచించారు. నదిని శుభ్రంగా ఉంచితే ఎక్కడి నుంచైనా ఆ నీరు తాగడానికి ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. 18 రోజుల యమునా యాత్రను ఆగస్టు 28న గోవిందాచార్య ప్రారంభించారు. సెప్టెంబర్ 15న అలహాబాద్లోని ప్రయాగ్ వద్ద ఈ యాత్ర ముగియనున్నది. గతేడాది అక్టోబర్లో గోవిందాచార్య గంగా యాత్రను నిర్వహించారు. మధ్యప్రదేశ్లో 29 రోజులపాటు నర్మదా యాత్రను కూడా ఆయన నిర్వహించారు. యమునా యాత్ర పూర్తయిన తర్వాత ఈ మూడు నదులపై నివేదికను రూపొందిస్తామని ఆయన తెలిపారు. నదుల సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఆయన తెలిపారు.
- Advertisement -