Tuesday, April 30, 2024

భవనం పైనుంచి పడి జిహెచ్ఎంసి ఉద్యోగి మృతి

- Advertisement -
- Advertisement -

GHMC Employee dead fell from Building

మేడ్చల్: జిహెచ్‌ఎంసి ఉద్యోగి ప్రమాదవశాత్తు భవనం పైనుంచి పడి మృతి చెందిన సంఘటన కూకట్‌పల్లి ప్రాంతం కెపిహెచ్‌బిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కమల్‌రాజ్ మోహ్ర(50) అనే వ్యక్తి జిహెచ్‌ఎంసి ఎంటమాలజీ డిపార్ట్‌మెంట్‌లో సేవలందిస్తున్నారు. బుధవారం ఉదయం కమల్ రాజ్ భవనం పైన వాకింగ్ చేస్తూ అలసిపోవడంతో పిట్టగొడపై కూర్చున్నాడు. ప్రమాదవశాత్తు భవనం పైనుంచి కిందపడిపోయాడు. వెంటనే కుటుంబ సభ్యులు అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే అతడు చనిపోయాడని వెల్లడించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News