పాట్నా: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పూట్ సూసైడ్ న్యూస్ వీక్షిస్తూ మనోవేధనకు గురై 17 ఏళ్ల బాలిక ఊరేసుకున్న సంఘటన కడమ్కౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజేంద్ర నగర్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఇషికా కుమారీ అనే విద్యార్థిని పదో తరగతి ఎగ్జామ్స్ రాసింది. గత కొన్ని రోజుల నుంచి పదో తరగతి పరీక్షలు అనుకున్న విధంగా రాయలేదని బాధపడుతూ ఉండేదని తల్లిదండ్రులు తెలిపారు. పరీక్షలలో విఫలమవుతాననే భయం ఆమెలో నెలకొందన్నారు. బాలీవుడ్ యాక్టర్ సుశాంత్ సింగ్ రాజ్పూట్ ఆత్మహత్య చేసుకున్న వార్త పదే పదే టివిల్లో వీక్షించేది. తల్లి దగ్గర ఉండి ఎంత జాగ్రత్త పడిన ఆమె టివి చూస్తేనే ఉండేది. ఇషికా తల్లి విశ్రాంతి కోసం మిద్దెపైకి వెళ్లనప్పుడు ఇషికా తన బెడ్రూమ్లోకి వెళ్లి ఉరేసుకుంది. తల్లి బెడ్ రూమ్ లకు వచ్చేచూసేసరికి ఆమె ఫ్యాన్ కు వేళాడుతుండడంతో స్థానికుల సహాయంతో ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు బాలిక చనిపోయిందని తెలిపారు. కదమ్కౌన్ పోలీస్ అధికారి నిశికాంత్ నిషి ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.
బాలీవుడ్ నటుడు సుశాంత్ సూసైడ్ న్యూస్ వీక్షిస్తూ… బాలిక ఆత్మహత్య
- Advertisement -
- Advertisement -
- Advertisement -