- Advertisement -
హైదరాబాద్: తెలంగాణలో జరిగిన ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు గురువారం విడుదల కానున్నాయి. ఇంటర్మీడియట్ మొదటి, రెండవ ఏడాది సంవత్సర ఫలితాల నివేదికను ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ మంగళవారం ప్రభుత్వానికి సమర్పించారు. మొదటి, రెండో సంత్సరం ఫలితాలను బోర్డు ఒకే సారి విడుదల చేయనుంది. ఇంటర్ ఫలితాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు తొమ్మిదిన్నర లక్షల మంది విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. గత ఏడాది అనుభవాల నేపథ్యంలో ఈ సారి ఫలితాలు సరిగ్గా వచ్చాయా? ఏమైనా లోపాలు ఉన్నాయా..? అన్న దానిపై ఒకటికి రెండుసార్లు పరీశీలించిన తర్వాత బోర్డు అధికారులు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు.
- Advertisement -