Friday, May 3, 2024

తల్లి మందలించడంతో విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్య..

- Advertisement -
- Advertisement -

కామారెడ్డిః తల్లిమందలించడంతో ఓ విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. రాజంపేటకు చెందిన శ్రీనిజ(16)ను కెజిబిపి వసతిగృహంలో ఉండి చదువుకోమని తల్లి మందలించింది. అయితే, తాను ఇంటివద్దనే ఉండి చదువుకుంటానని శ్రీనిజ తల్లికి తేల్చి చెప్పింది.

ఈ క్రమంలో శ్రీనిజను హాస్టల్‌కు వెళ్లి చదువుకోవాలని తల్లి కొంచెం గట్టిగా మందలించింది. దీంతో మనస్థాపానికి గురైన శ్రీనిజ, ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. శ్రీనిజ మృతితో కుటుంబంలో విషాదం నెలకొంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News