Sunday, April 28, 2024

దొంగిలించిన అన్నపూర్ణ విగ్రహం.. వందేళ్ల తరువాత తిరిగి కాశీకి పయనం

- Advertisement -
- Advertisement -

Goddess annapurna idol returned to uttar pradesh

న్యూఢిల్లీ : దాదాపు వందేళ్ల క్రితం చోరీకి గురైన మాతా అన్నపూర్ణ విగ్రహం తిరిగి కాశీకి పయనమైంది. ఈ విగ్రహాన్ని ఇటీవల కెనడా నుంచి భారత్‌కు తీసుకురాగా, గురువారం ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వానికి అధికారికంగా అప్పగించారు. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి ఈ విగ్రహాన్ని యూపి ప్రభుత్వానికి అందజేశారు. కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, మీనాక్షీ లేఖి సహా పలువురు మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. నాలుగు రోజుల పాటు శోభాయాత్ర నిర్వహించి నవంబరు 15 న కాశీలో విగ్రహ ప్రతిష్ఠ చేయనున్నారు. గురువారం ప్రత్యేక రథంలో ఈ విగ్రహాన్ని ఢిల్లీ నుంచి అలీగఢ్ తీసుకెళ్లారు. నవంబరు 13 న కనోజ్‌కు తీసుకెళ్లి అక్కడి నుంచి అయోధ్య వరకు శోభాయాత్ర నిర్వహిస్తారు. నవంబర్ 15 న వారణాసి లోని కాశీ విశ్వనాధ ఆలయంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తామని అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News