ముంబయి: తనపై నిరాధార ఆరోపణలు చేసిన మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్కు మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ అల్లుడు సమీర్ ఖాన్ పరువు నష్టం కింద ఐదు కోట్ల రూపాయలు చెల్లించాలంటూ లీగల్ నోటీసు పంపించారు. ఫడ్నవీస్ తనకు క్షమాపణ చెప్పాలని కూడా సమీర్ ఖాన్ తన నోటీసులో డిమాండ్ చేశారు. అయితే, సమీర్ ఖాన్ పంపిన నోటీసుకు న్యాయపరంగా జవాబిస్తామని బిజెపి రాష్ట్ర ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించారు. ఈ నెల 10వ తేదీన ఫడ్నవీస్కు పంపిన లీగల్ నోటీసు స్నాప్షాట్ను సమీర్ ఖాన్ భార్య నిలోఫర్ మాలిక్ ఖాన్ తన ట్విటర్ ఖాతాలో గురువారం పోస్ట్ చేశారు. ఈ ఏడాది జనవరిలో డ్రగ్స్ కేసులో సమీర్ ఖాన్ను ఎన్సిబి అరెస్టు చేసింది. ఆధారాలు లేవన్న కారణంతో ఈ ఏడాది సెప్టెంబర్లో ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఎన్సిబి అధికారులు తప్పుడు కేసులో సమీర్ ఖాన్ను ఇరికించారని ఆయన తరఫున న్యాయవాది లీగల్ నోటీసులో పేర్కొన్నారు. అయితే, నవంబర్ 1వ తేదీన ఒక న్యూస్ చానల్కు ఇచ్చిన ఇంటర్వూలో ఫడ్నవీస్ మాట్లాడుతూ మంత్రి మాలిక్ అల్లుడి వద్ద డ్రగ్స్ ఉన్నట్లు ఎన్సిబి అధికారులు కనుగొన్నారని ఆరోపించారు.
ఫడ్నవీస్కు మాలిక్ అల్లుడి పరువు నష్టం నోటీసు
- Advertisement -
- Advertisement -
- Advertisement -