Monday, May 13, 2024

నలుగురు మహిళ భక్తులపై బాబా అత్యాచారం….

- Advertisement -
- Advertisement -

Godman rape four women in rajasthan

జైపూర్: ఓ ఆశ్రమంలో నలుగురు మహిళ భక్తులపై బాబా అత్యాచారం చేసిన సంఘటన రాజస్థాన్ రాష్ట్రం జైపూర్‌లోని భంక్రోటా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. శైలేంద్ర మెహతా అనే బాబా తపశ్వి ఆశ్రమ్ నిర్వహిస్తున్నాడు. తపశ్వి ఆశ్రమ్ వందల కొద్ది భక్తులు వచ్చి బాబా వద్ద ఆశీర్వాదం తీసుకుంటారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మహిళలు పూజాల పేరుతో ఆశ్రమంలో ఉంటున్నారు. ఆశ్రమంలో ఉన్న నలుగురు మహిళలపై బాబా అత్యాచారం చేయడంతో స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీస్ అధికారి ముకేష్ చౌదరీ కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేస్తామని వెల్లడించారు. ఒక మహిళ కేసును విత్ డ్రా చేసుకోగా మరో ముగ్గురు మహిళలు న్యాయం కోసం పోరాడడానికి కోర్టు మెట్లు ఎక్కుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News