Saturday, April 27, 2024

దసరాకు సొంతూళ్లకు పోతున్నారా? పోలీసుల సూచనలు మీకోసం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: దసరాకు సొంతూళ్లకు వెళ్లేవారికి సైబరాబాద్ పోలీసులు పలు సూచనలు చేశారు. పేట్ బషీర్ బాగ్ పోలీసులు ఆటో ద్వారా ప్రచారం చేయిస్తున్నారు. విలువైన వస్తువులు ఇంట్లో ఉంచుకోవద్దు అని పోలీసులు హెచ్చరించారు. ఎక్కువ రోజులు ఊరికి వెళ్తే సంబంధించిన పిఎస్ లో సమాచారం ఇవ్వాలని సూచించారు. ఇంటికి సిసి కెమెరాలు ఏర్పాటు చేసి ఆన్ లైన్ లో పరిశీలించాలని తెలిపారు. ఇంటికి సెంట్రల్ లాకింగ్ సిస్టం ఏర్పాటు చేసుకోవడం మంచిదన్నారు. పండగలకు సొంతూళ్లకు వెళితే ఇళ్లల్లో చోరీలు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు తగిన సూచనలు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News