Monday, May 20, 2024

రేపటి నుంచి గోల్ఫ్ టోర్నీ ప్రారంభం..

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: ప్రతిష్టాత్మకమైన గోల్కొండ మాస్టర్స్ తెలంగాణ ఓపెన్ గోల్ఫ్ టోర్నమెంట్‌కు సెప్టెంబర్ 2వ తేదీన తెరలేవనుంది. ఈ టోర్నీలో దేశ వ్యాప్తంగా 129 మంది ప్రముఖ గోల్ఫర్లు పోటీ పడనున్నారు. మొత్తం రూ.40 లక్షల ప్రైజ్‌మనీతో ఈ టోర్నీని నిర్వహిస్తున్నారు. టోర్నీకి సంబంధించిన వివరాలను మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిర్వాహకులు వెల్లడించారు. ఈ సమావేశంలో ఒలింపియన్, డిఫెండింగ్ చాంపియన్ ఉదయన్ మానె, పిజిటిఐ ఆర్డర్ ఆఫ్ మెరిట్ లీడర్ కరణ్ దీప్ కొదార్, చిక్కరంగప్ప, రషీద్ ఖాన్, కలిన్ జోషి, విరాజ్ మడప్ప తదితరులు పాల్గొన్నారు. కోవిడ్ కారణంగా చాలా కాలంగా ఆగిపోయిన గోల్ఫ్ క్రీడను మళ్లీ గాడిలో పెట్టేందుకు ఈ టోర్నీని నిర్వహిస్తున్నట్టు వారు వెల్లడించారు.

Golf Tournament begins from Sep 2

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News