Thursday, May 9, 2024

బిసి కమిషన్ చైర్మన్ గా కృష్ణమోహన్ రావు ప్రమాణం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఖైరతాబాద్ లోని బిసి కమిషన్ కార్యాలయంలో బిసి కమిషన్ చైర్మన్ వకళాభరణం కృష్ణమోహన్ రావు, కమిషన్ సభ్యులుగా శుభప్రద్ పటేల్, సిహెచ్ ఉపేందర్, కిషోర్ గౌడ్ లు ప్రమాణ స్వీకారం చేశారు. కార్యాక్రమంలో మంత్రి గంగుల కమలాకర్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, సంగీత నాటక రంగ చైర్మన్ బాద్మి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బిసి కమిషన్ చైర్మన్ వకళాభరణం కృష్ణమోహన్ రావు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో బిసి కమిషన్ ఛైర్మన్ నియమించినందుకు పదవి బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో తమదైన శైలిలో ముందుకు వెళ్లిన శుభప్రద్ పటేల్, కిషోర్ గౌడ్, ఉపేందర్ గౌడ్ లకు బిసి కమిషన్ లో సభ్యులుగా రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ శాశ్వత పేద సమాజం కోసం తెలంగాణ ప్రభుత్వం పరితపిస్తుందన్నారు. బిసిల అభ్యున్నతికి కృషి చేస్తూ ముందుకు వెళ్తామని, కమిషన్ పరిధిలో ఉన్న అన్ని చట్టలను క్రమ పద్ధతిలో ప్రజల అర్జీలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు బిసి కమిషన్ పనిచేస్తుందని పేర్కొన్నారు.

Krishna Mohan Rao takes oath as BC Chairman

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News