Wednesday, May 8, 2024

తెలంగాణ ఉద్యోగులకు దేశంలోనే మంచి జీతాలు: సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

Good salaries for Telangana employees in country: CM KCR

హైదరాబాద్: తెలంగాణ ఉద్యోగులు దేశంలోనే మంచి జీతాలు అందుకుంటున్నారని సిఎం కెసిఆర్ అన్నారు. తెలంగాణ వస్తే దేశంలోనే ధనిక రాష్ట్రం అవుతుందని చెప్పానని కెసిఆర్ గుర్తుచేశారు. నిన్న కోకాపేటలో 45 ఎకరాల ప్రభుత్వ భూమిని అమ్మితే రూ.2వేల కోట్లు వచ్చాయని, ఆ డబ్బును ప్రజల సంక్షేమం కోసం వినియోగిస్తామని చెప్పారు. వరి ధాన్యం అమ్మితే మరో రూ.51 వేల కోట్లు వచ్చాయని తెలిపారు. తెలంగాణ స్వప్నం సాకారం కోసం విశ్రమించనని సిఎం పేర్కొన్నారు. చేతన వర్గం సమున్నతంగా బతికేందుకు కృషిచేస్తున్నామని వెల్లడించారు. తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉందన్నారు. తెలంగాణ స్వప్నం సాకారానికి ప్రజల దీవెన, సహకారం కావాలన్నారు.

Good salaries for Telangana employees in country: CM KCR

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News