Friday, April 26, 2024

భువనగిరి సమీపంలో పట్టాలు తప్పిన గూడ్స్‌రైలు

- Advertisement -
- Advertisement -

Goods train derails at Yadadri Bhuvanagiri

భువనగిరి : యాదాద్రి జిల్లా భువనగిరి మున్సిపాలిటీ పరిధిలో ఓ గూడ్స్‌రైలు గురువారం పట్టాలు తప్పింది. గుంటూరు వైపు నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న గూడ్స్‌రైలు బొమ్మాయిపల్లి రైల్వేస్టేషన్ వద్దకు రాగానే పట్టాలు తప్పింది. ప్రమాదం కారణంగా మూడు బోగీలు ట్రాక్ దిగి సమీపంలోని పొదల్లోకి దూసుకెళ్లాయి. విషయం తెలుసుకున్న అధికారులు అక్కడికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. సాంకేతిక లోపం కారణంగానే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు భావిస్తున్నారు. ఈ ఘటనతో ఆ మార్గంలో వెళ్లే ఇతర రైళ్ల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా మరమ్మతులు చేపట్టారు.

Goods train derails at  Yadadri Bhuvanagiri

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News