Sunday, April 28, 2024

పేదింటి బాలికలకు ఉన్నత విద్యే ప్రభుత్వ లక్ష్యం

- Advertisement -
- Advertisement -
  • జిల్లాలోని 17 కెజిబివిలో నో అడ్మిషన్ బోర్డ్
  • కెజిబివి అప్ గ్రేడ్ జూనియర్ కళాశాల భవనం, హన్మకొండ- సిద్దిపేట ఫోర్ లేన్ ఆర్‌ఓబి రహదారి శంకుస్థాపన చేసిన  మంత్రి తన్నీరు హరీశ్‌రావు

సిద్దిపేట: పేదింటి బాలికలకు ఉన్నత విద్యే అందించడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. బుధవారం సిద్దిపేట అర్బన్ మండలం ఎల్లుపల్లి మిట్టపల్లి గ్రామ పరిధిలోని కెజిబివి అప్ గ్రేడ్ జూనియర్ కళాశాలకు రెండు కోట్ల 30 లక్షలతో నూతన భవన అదునపు తరగతి గదుల నిర్మాణ పనులకు జడ్పీ చైర్‌పర్సన్ రోజా శర్మ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్‌తో కలిసి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో బాలికా విద్యకు కస్తూర్బా గాంధీ పాఠశాలలు నిలయాలుగా మారాయన్నారు.

ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యాబోధన ప్రభుత్వం పకడ్బందీగా నిర్వహిస్తున్నదని తెలిపారు. సిద్దిపేట జిల్లాలోని 17 కెజిబివి పాఠశాలలు నో అడ్మిషన్స్ బోర్డు ప్టె స్థాయికి చేరడమే ఇందుకు నిదర్శనమని తెలిపారు. కెజిబివిలతో పేద వర్గాల చిన్నారులకు కొండంత అండ దొరికినట్లు అయ్యిందని, అందనంత దూరంగా ఉన్న కార్పొరేట్ స్థాయి విద్య, వసతులతో జిల్లాలోని 22 కెజిబివిల్లో 17 కెజిబివిలలో నో అడ్మిషన్స్ బోర్డు పెట్టినట్లు, ఇప్పుడు అడ్మిషన్లు దొరకని పరిస్థితికి జిల్లాలోని కెజిబివిలు చేరడం అభినందనీయమని అన్నారు.

పౌష్టికాహారం, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ

భోజనం ఏలా ఉందమ్మా. మెనూ ప్రకారం ఇస్తున్నారా. లేదా.. అంటూ కెజిబివి విద్యార్థినులతో మంత్రి హరీశ్ ముచ్చటించారు. ఉదయం అల్ఫాహారం, మధ్యాహ్నం గుడ్డుతో కూడిన భోజనం, సాయంత్రం నాణ్యమైన భోజనం అందిస్తున్నారని, ఆదివారం చికెన్‌తో కూడిన భోజనం వడ్డిస్తున్నారని విద్యార్థినులు మంత్రికి బదులిచ్చారు. ఈ మేరకు కెజిబివి ఇంటర్మీడియట్ విద్యార్థినులు ల్యాబ్ సౌకర్యం కల్పించాలని మంత్రిని కోరగా వెంటనే మంజూరు చేయిస్తానని హామీనిచ్చారు. అనంతరం ప్రతీ తరగతి గదిలో విద్యార్థినులతో మంత్రి ఆత్మీయతతో పలకరింపులు చేశారు.

హన్మకొండ- సిద్దిపేట రహదారిన ఫోర్ లేన్ ఆర్‌ఓబి

నూతనంగా నిర్మిస్తున్న మనోహరాబాద్ – కొత్తపల్లి రైల్వే లైన్ పై సిద్దిపేట అర్బన్ మండలం రంగదాంపల్లి వద్ద మెదక్ – ఎల్కతుర్తి జాతీయ రహదారిపై రూ.55 కోట్ల వ్యయంతో నాలుగు వరసల-ఆర్వోబీ రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి మంత్రి హరీశ్ రావు శంకుస్థాపన చేశారు. మంత్రి వెంట జెడ్పీ చైర్మన్ రోజాశర్మ, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News